Saturday, May 4, 2024

చివరి రోజు వర్షం అడ్డంకి..

- Advertisement -
- Advertisement -

పోర్ట్ ఆఫ్ స్పెయిన్: భారత్‌-వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు చివరి రోజు వర్షం అడ్డంకిగా మారింది. సోమవారం ఐదో రోజు భారీ వర్షం కురువడంతో ట్రినిడాడ్ మైదానం మొత్తం చిత్తడిగా మారిపోయింది. దీంతో లంచ్ విరామ సమయం వరకు ఆట ప్రారంభం కాలేదు.

ఆ తర్వాత కూడా ఔట్ ఫీల్డ్ చిత్తడిగానే ఉండడంతో ఆటను ప్రారంభించడం సాధ్యపడలేదు. కాగా, ఆఖరి రోజు విజయం సాధించాలంటే విండీస్ 289 పరుగులు చేయాలి. భారత్ గెలవాలంటే 8 వికెట్లు పడగొట్టాలి. ప్రస్తుతం విండీస్ రెండు వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News