Tuesday, April 30, 2024

ప్రపంచంలో రెండో అతిపెద్ద ఫోన్ల తయారీదారుగా భారత్ !

- Advertisement -
- Advertisement -

 

India 2nd largest Mobile producter

న్యూఢిల్లీ:  ఆర్థిక సంవత్సరం 2022లో  భారతదేశపు మొబైల్ ఫోన్ ఉత్పత్తి విలువ రెండింతలు పెరిగి ప్రపంచవ్యాప్తంగా ఈ పరికరాల తయారీలో దేశాన్ని రెండవ అతిపెద్ద తయారీదారుగా మార్చిందని ప్రభుత్వం తెలిపింది.భారతదేశం 2022లో రూ. 5,277 కోట్ల విలువైన మొబైల్ ఫోన్‌లను తయారు చేసింది.  ఇది FY21లో  రూ. 2,334 కోట్ల విలువ మేరకు ఉండింది.  తమ ఉత్పత్తి-సంబంధిత ప్రోత్సాహక పథకం ఘనత కారణంగా ఈ వృద్ధి సాధ్యమైందని ప్రభుత్వం తెలిపింది.

“ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం కారణంగా, భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మొబైల్ ఫోన్ తయారీదారులలో ఒకటిగా ఉంది, వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మొబైల్ హ్యాండ్‌సెట్‌ల తయారీలో రెండవ అతిపెద్ద తయారీదారుగా అవతరించింది” అని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పార్లమెంటులో ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News