Sunday, April 28, 2024

మే 20 నుంచి స్పెక్ట్రమ్ వేలం

- Advertisement -
- Advertisement -

ముంబై: తదుపరి స్పెక్ట్రమ్ వేలం మే 20 నుంచి ప్రారంభం కానుంది. ఈమేరకు శుక్రవారం టెలికాం శాఖ(డాట్) దరఖాస్తుల ఆహ్వానానికి నోటీసు జారీ చేసింది. ఈసారి వేలంలో టెలికాం ఆపరేటర్ల నుండి స్పందన ఆశించినంతగా ఉండకపోవచ్చని డాట్ భావిస్తోంది. ఎందుకంటే గత సంవత్సరమే కంపెనీలు భారీగా స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేశాయి. కంపెనీల దృష్టి తమ ఆపరేషన్‌లో ఉన్న, గడువు ముగియబోతున్న స్పెక్ట్రమ్ టాప్‌అప్‌పై ఉంటుంది.

వేలం ద్వారా టెలికాం శాఖకు దాదాపు రూ.10,000 కోట్లు రావచ్చని అంచనా వేస్తున్నారు.రూ.96.31 వేల కోట్ల బేస్ ప్రైస్‌తో ఈ వేలం జరగనుంది. 800, 900, 1,800, 2,100, 2,300, 2,500, 3,300 మెగా హెరట్జ్, 26 గిగాహెరట్జ్ బ్యాండ్‌లకు వేలం వేయనున్నారు. ఈ వేలంలో కొన్ని కంపెనీలు దివాలా తీసిన స్పెక్ట్రమ్‌తో పాటు, 2024లో గడువు ముగిసే సమయానికి గడువు ముగిసే స్పెక్ట్రమ్ కూడా ఉంటుంది. స్పెక్ట్రమ్ ఎలా పని చేస్తుందంటే టెలికమ్యూనికేషన్స్‌తో సహా అనేక సేవలకు వైర్‌లెస్‌గా సమాచారాన్ని తీసుకువెళ్లగలిగే విద్యుదయస్కాంత రేడియో ఫ్రీక్వెన్సీలు ఎయిర్‌వేవ్‌లతో, అయితే ఈ వాయు తరంగాలను ప్రభుత్వం నిర్వహిస్తుంది.

ఎయిర్‌టెల్, వొడాఐడియా
పాత లైసెన్స్‌ల పునరుద్ధరణ
భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా 1,800 మెగా హెరట్జ్, 900 మెగా హెరట్జ్ 4జి బ్యాండ్‌లలో గడువు ముగిసిన పాత లైసెన్స్‌లను పునరుద్ధరిస్తాయి. బ్రోకరేజ్ జెఫరీస్ ప్రకారం, ఎయిర్‌టెల్ సుమారు రూ. 4,200 కోట్లు, వొడాఫోన్ ఐడియా సుమారు రూ. 1,950 కోట్ల విలువైన ఎయిర్‌వేవ్‌లను పునరుద్ధరించాల్సి ఉంటుంది. అయితే మార్కెట్ లీడర్ రిలయన్స్ జియో ఈ సంవత్సరం స్పెక్ట్రమ్‌ను పునరుద్ధరించాల్సిన అవసరం లేదు.

జియో చివరిసారి 5జి కోసం రూ. 88,078 కోట్లు ఖర్చు
2022 స్పెక్ట్రమ్ వేలంలో ప్రభుత్వం 20 సంవత్సరాల చెల్లుబాటుతో 72,097.85 మెగా హెరట్జ్ స్పెక్ట్రమ్‌ను అందించింది. రిలయన్స్ జియో 5జి స్పెక్ట్రమ్‌పై రూ.88,078 కోట్లు ఖర్చు చేసింది. దీని తర్వాత ఎయిర్‌టెల్ రూ.43,084 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.18,799 కోట్లు ఖర్చు చేశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News