Tuesday, April 30, 2024

జాహ్నవి కందుల మృతి కేసు.. రివ్యూ కోరిన భారత్

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జాహ్నవి కందుల మృతికి కారణమైన పోలీస్ అధికారి కెవిన్ డవేపై నేరాభియోగాలు మోపడం లేదని అక్కడి అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సమీక్షించాలని శనివారం సియాటెల్ భారత రాయబార కార్యాలయం కోరింది.

ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాకు చెందిన 23 ఏళ్ల కందుల జాహ్నవి 2023 జనవరిలో సియాటెల్ లోని పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొని మృతి చెందింది. సాక్షాధారాలు లేకపోవడంతో డవేపై అభియోగాలు మోపడం లేదని కింగ్ కౌంటీ ప్రాసిక్యూటింగ్ కార్యాలయం రెండు రోజుల క్రితం ప్రకటించింది. సీనియర్ అటార్నీలతో దీనిపై విచారణ జరిపిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలిపింది.

అయితే ఈ కేసు గురించి స్థానిక అధికారులు, సియాటెల్ పోలీస్‌ల వద్ద గట్టిగా లేవనెత్మాని, సమీక్ష కోసం ప్రస్తుతం ఈ కేసును సియాటెల్ అటార్నీ కార్యాలయానికి సిఫార్సు చేసిన తరువాత దర్యాప్తు నివేదిక కోసం వేచి చూస్తున్నామని సియాటెల్ భారత కార్యాలయం వెల్లడించింది. జాహ్నకి కుటుంబానికి న్యాయం జరిగేలా కృషి చేస్తున్నామని పేర్కొంది. మరోవైపు జాహ్నవి మృతిని తక్కువ చేసి చులకనగా మాట్లాడిన మరోపోలీస్ అధికారి డేనియల్ అడెరెర్ ప్రమాదం జరిగిన సమయంలోఅక్కడ లేడని కింగ్ కౌంటీ ప్రాసిక్యూటింగ్ అటార్నీ తెలిపారు. చులకనగా మాట్లాడిన అధికారిపై ఇప్పటికే సస్పెన్షన్ వేటుపడగా, అతనిపై తుది విచారణ మార్చి 4న జరగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News