- Advertisement -
ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీ, ముంబయి వంటి నగరాల్లో సెకండ్ వేవ్ ప్రారంభమైంది. దీంతో కరోనా కేసులు 90 లక్షలు దాటాయి. గత 24 గంటల్లో 45,882 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 584 మంది మృత్యువాతపడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 90.04 లక్షలకు చేరుకోగా 1.32 లక్షల మంది చనిపోయారు. కరోనా వ్యాధి నుంచి 84.28 లక్షల మంది కోలుకోగా 4.43 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు దేశంలో 12.95 కోట్ల మందికి కరోనా టెస్టులు చేశామని ఐసిఎంఆర్ ప్రకటించింది.
- Advertisement -