- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత పదిహేను రోజుల నుంచి 1000కి లోపు కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 894 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా నలుగురు మృతి చెందారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 2.61 లక్షలకు చేరుకోగా 1423 మంది మృత్యువాతపడ్డారని తెలిపారు. కరోనా వ్యాధి నుంచి 2.47 లక్షల మంది కోలుకొని ఇండ్లలోకి వెళ్లగా 12 వేల మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం 50.5 లక్షల మందికి కరోనా టెస్టులు చేసింది. గురువారం ఒక్క రోజే 39 వేల మందికి కరోనా టెస్టులు చేసింది.
- Advertisement -