హైదరాబాద్: సామాజిక న్యాయం టిఆర్ఎస్తోనే సాధ్యమని మరోసారి సిఎం కెసిఆర్ నిరూపించారని టిఆర్ఎస్ నేత, ఎంఎల్సి పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో భాగంగా పల్లా మీడియాతో మాట్లాడారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో 56 శాతం బిసిలకు టికెట్లు కేటాయించామన్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో 150 సీట్లలో 84 సీట్లు బిసిలకు కేటాయించామని, బిజెపి నేతలు దొంగే దొంగ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్లో వరద సాయం కింద కేంద్రం ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదని, వరద సాయం రూ.10 వేలు ఇచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని స్పష్టం చేశారు. బిజెపి గెలిస్తే చలాన్లు ఉండవని ప్రకటించడం హాస్యాస్పదమని విమర్శించారు. తాగి డ్రైవ్ చేయమని చెప్పడం బిజెపి ఉద్దేశమా? అని ప్రశ్నించారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఇలాగే చలాన్లు రద్దు చేస్తున్నారా అని నిలదీశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదని హితువుపలికారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో మరోసారి బిజెపికి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
చలాన్లు లేవు అంటే… తాగి డ్రైవ్ చేయమంటున్నారా?: పల్లా
- Advertisement -
- Advertisement -
- Advertisement -