- Advertisement -
ఢిల్లీ: భారత్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఢిల్లీ, ముంబయి వంటి నగరాలలో ఇప్పుడే సెకండ్ వేవ్ ప్రారంభమైంది. ఢిల్లీలో గత 24 గంటల్లో కరోనా వైరస్ బారినపడి 121 మంది మృతి చెందారు. భారత్లో గత 24 గంటల్లో 37,975 మందికి కరోనా పాజిటివ్ రాగా 480 మంది మృత్యువాతపడ్డారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య 91.77 లక్షలకు చేరుకోగా 1.34 మంది లక్షల మంది చనిపోయారు. కరోనా వ్యాధి నుంచి 86.04 మంది కోలుకోగా 4.38 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటివరకు దేశంలో 13.4 కోట్ల మందికి కరోనా టెస్టులు చేశామని ఐసిఎంఆర్ ప్రకటించింది. సోమవారం ఒక్క రోజు 11 లక్షల మందికి కరోనా టెస్టులు చేశారు.
- Advertisement -