Thursday, April 18, 2024

దేశంలో కొత్తగా 13,203 కరోనా కేసులు….

- Advertisement -
- Advertisement -

India coronavirus active cases state wise

 

ఢిల్లీ: భారత్‌లో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య కూడా తగ్గుతోంది. గత 24 గంటల్లో 13,203 కరోనా కేసులు నమోదుకాగా 131 మంది మృతి చెందారు. కరోనా కేసుల సంఖ్య 1.06 కోట్లకు చేరుకోగా 1.53 లక్షల మంది చనిపోయారు. కరోనా వ్యాధి నుంచి ఇప్పటి వరకు 1.03 కోట్ల మంది కోలుకోగా 1.84 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. దేశంలో ఇప్పటి వరకు 1.61 లక్షల కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. దేశంలో ఇప్పటి వరకు 19.2 కోట్ల మందికి కరోనా టెస్టులు చేశారు. కరోనా కేసుల సంఖ్యలో అమెరికా (2.57 కోట్లు) తొలి స్థానంలో ఉండగా భారత్ (1.06 కోట్లు) రెండో స్థానంలో ఉంది. కరోనాతో మృతి చెందిన వారి విషయంలో యుఎస్‌ఎ (4.29 లక్షలు) తొలి స్థానంలో ఉండగా వరసగా బ్రెజిల్(2.17 లక్షలు), భారత్(1.53 లక్షలు), మెక్సికో(1.49 లక్షలు), యుకె(97 వేలు) దేశాలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News