- Advertisement -
ఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. మహానగరాలు కరోనా వైరస్ ధాటికి విలవిలలాడిపోతున్నాయి. గత 24 గంటల్లో 94,371 కరోనా కేసులు నమోదుకాగా 1114 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత పది రోజుల నుంచి దాదాపుగా ప్రతి రోజు 95 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. భారత్లో కరోనా కేసుల సంఖ్య 47.54 లక్షలకు చేరుకోగా 78,586 మంది మృత్యువాతపడ్డారు. దేశ వ్యాప్తంగా నిన్న ఒక్క రోజే 10.71 లక్షల మందికి కరోనా టెస్టులు చేశారు. ఇప్పటి వరకు భారత్లో 5.62 కోట్ల మందికి కరోనా టెస్టులు చేశామని ఐసిఎంఆర్ ప్రకటించింది.
- Advertisement -