Tuesday, May 7, 2024

జనాభా సంఖ్యలో చైనాను అధిగమిచిన భారత్

- Advertisement -
- Advertisement -

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ అవతరించింది. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం… భారతదేశం 142.86 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనాను అధిగమించింది. UN ప్రపంచ జనాభా డాష్‌బోర్డ్ ప్రకారం చైనా జనాభా 142.57 కోట్లు. భారత్ లో ప్రస్తుతం చైనా కంటే 29 లక్షల మంది అధికంగా ఉన్నారని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది.

ప్రపంచ జనాభాలో మూడింట ఒక వంతు ఈ రెండు దేశాల్లోనే నివసిస్తున్నట్లు సమాచారం. అగ్రరాజ్యం అమెరికా 340 మిలియన్లతో మూడో స్థానంలో ఉందని యుఎన్ పేర్కొంది. ఆఫ్రికాలో కూడా, పెరుగుతున్న జనాభా ధోరణి చూడవచ్చు. ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఖండం 2100 నాటికి దాని జనాభాలో 1.4 నుండి 3.9 బిలియన్ల జనాభాకు పెరుగుతుందని అంచనా వేయబడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News