- Advertisement -
చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో 36.1 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 106 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. భారత్ ఇప్పటివరకు 301 పరుగుల ఆధిక్యంలో ఉంది. జాక్ లీచ్ బౌలింగ్ ధాటికి భారత బ్యాట్స్మెన్లు కుప్పకూలిపోయారు. భారత బ్యాట్స్మెన్లలో ఎవరు 30 పరుగుల కంటే ఎక్కువ చేయలేదు. భారత బ్యాట్స్మెన్లు రోహిత్ శర్మ (26), శుభ్మన్ గిల్ (14), ఛటేశ్వరా పుజారా(07), రిషబ్ పంత్(08), అజింక్య రహానే(10), అక్షర పటేల్ పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ(22), అశ్విన్ (08) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జాక్ లీచ్ మూడు వికెట్లు పడగొట్టగా మోయిన్ అలీ రెండు వికెట్లు తీశాడు.
- Advertisement -