Tuesday, May 7, 2024

దేశంలో మరో 2,76,070 మందికి కరోనా

- Advertisement -
- Advertisement -

India reports 276070 new Covid-19 cases

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో 2,76,070 కొత్త కోవిడ్-19 కేసులు, 3,874 మరణాలు సంభవించాయి. అదే సమయంలో 3,69,077మంది కోలుకున్నారు. ఇండియాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,57,72,400కి చేరింది. దేశంలో ఇప్పటివరకు 2,23,55,440 కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య 2,87,122కి పెరిగింది. ప్రస్తుతం భారత్  31,29,878 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు మొత్తం 18,70,09,792 మందికి కరోనా టీకాలు వేశారు. 4 రోజుల తర్వాత దేశంలో నాలుగువేల దిగువకు కరోనా మరణాలు నమోదయ్యాయి. గత 24గంటల్లో 20.55 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. 20 మే 2021 వరకు 32,23,56,187 నమూనాలను పరీక్షించారు. వీటిలో 20,55,010 నమూనాలను నిన్న పరీక్షించారని ఐసిఎంఆర్ వెల్లడించింది.

India reports 276070 new Covid-19 cases

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News