Saturday, April 27, 2024

దేశంలో కాస్త తగ్గిన కరోనా.. 40వేల మంది రికవరీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భార‌త్‌లో మహమ్మారి క‌రోనా వైర‌స్ ఉధృతి తీవ్రత కాస్త తగ్గింది. దేశంలో ప్రతి రోజూ 40వేలకు పైగా నమోదయ్యే పాజిటీవ్ కేసులు తగ్గాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 38,628 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనాతో మరో 617మంది బాధితులు మృతిచెందారు. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,18,95,385కు పెరిగింది. ఇప్పటివరకు కరోనాతో 4,27,371మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 40,017 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3,10,55,861 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 4,12,153 కరోనా యాక్టివ్‌గా కేసులు ఉన్నాయి.

India reports 40k recoveries from Covid in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News