- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి రోజురోజుకు పెరుగుతుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో 43,846 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 22,956 కోలుకోగా, మరో 197 కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం కరోనా కేసులు సంఖ్య 1,15,99,130కి పెరిగింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,11,30,288 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఇండియాలో 3,09,087 యాక్టివ్ కేసులున్నాయి. కోవిడ్ భారినపడి మొత్తం 1,59,755 మంది మృతి చెందారు. దేశంలో మొత్తం 4,46,03,841 కరోనా టీకాలు వేసినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
India reports 43846 new Covid-19 cases
- Advertisement -