Friday, April 19, 2024

దేశంలో మరో 4వేల కరోనా కేసులు నమోదు..

- Advertisement -
- Advertisement -

India Reports 4510 new corona cases in 24 hrs

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ తగ్గుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 4,510 మందికి కరోనా వైరస్‌ సోకిందని, వైరస్ బారినపడి మరో 14 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. అదే సమయంలో 5,640మంది కొవిడ్ మహామ్మారి నుంచి కోలుకున్నట్లు తెలిపింది. తాజా కేసులతో ప్రస్తుతం దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4.45కోట్లకు చేరుకుంది. ఇందులో 4.39కోట్ల మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక, ఇప్పటివరకు కరోనాతో 5,28,403 మంది మరణించారు.కాగా, ప్రస్తుతం దేశంలో 46,516 కేసులు యాక్టివ్‌ ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 216.95 కోట్లకు పైగా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ఆరోగ్య శాఖ పేర్కొంది.

India Reports 4510 new corona cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News