Wednesday, May 8, 2024

దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు.. 1059మంది మృతి

- Advertisement -
- Advertisement -

India Reports over 1.27 lakh fresh corona cases 

న్యూఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ..  మరణాలు మాత్రం వెయ్యికి పైగా నమోదవుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 1,27,952 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1059 మంది బాధితులు మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 4.18 కోట్లకు చేరుకోగా 5,01,114 మంది దుర్మరణం చెందారు. గత 24 గంటల్లో 2,30,814మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు దేశంలో 4.02కోట్ల మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 13.31 లక్షల మంది  చికిత్స పొందుతున్నారు. దేశంలో పాజిటీవిటి రేటు 7.9శాతానికి తగ్గిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు దేశంలో 168.98 కోట్ల మంది కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశామని పేర్కొంది.

India Reports over 1.27 lakh fresh corona cases 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News