- Advertisement -
మెల్ బోర్న్: రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో భారత జట్టు అని వికెట్టు కోల్పోయి 326 పరుగులు చేసింది. దీంతో భారత్ 131 పరుగుల ఆధిక్యంలో ఉంది. రహానే సెంచరీతో మెరవడంతో టీమిండియా ఈ స్కోరు చేయగలిగింది. ఐదో వికెట్ పై రవీంద్ర జడేజా-రహానే 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. జడేజా హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, లయాన్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా కమ్నీస్ రెండు, హజీల్ వుడ్ ఒక వికెట్ పడగొట్టాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 195 పరుగులు చేసింది. మూడో రోజు ఆసీస్ జట్టు బ్యాటింగ్ చేస్తోంది. ప్రస్తుతం క్రీజులో మాథ్యూ వాడే(0), జోయ్ బర్న్స్(1) ఉన్నారు.
- Advertisement -