Friday, April 26, 2024

మిరాకిల్ విన్నింగ్…

- Advertisement -
- Advertisement -

India Won by 4 Wickets in T20 WC 2022

మెల్బోర్న్: టీ20 వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన ఉత్కంఠపోరులో భారత్ ఘన విజయం సాధించింది. పాకిస్తాన్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి ఆఖరి ఓవర్లో ఛేదించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విరాట్ కోహ్లీ 53 బంతుల్లో 82 పరుగులు చేశారు. భారత్-పాక్ మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. సూపర్ బ్యాటింగ్ తో విరాట్ భారత్ కు విజయం అందించాడు. భారత బ్యాటర్లు కోహ్లి 82, హర్దిక్ పాండ్య 40 రాణించారు. సూర్యకుమార్ యాదవ్(15), అశ్విన్(01) నాటౌట్, రోహిత్(04), రాహుల్(04),  అక్షర్ పటేల్(02), దినేష్ కార్తీక్(01)  విఫలమయ్యారు. 82 పరుగులు చేసి విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. పాక్ బౌలర్లలో హరిష్ రౌఫ్, మహ్మద్ నవాజ్ చెరో రిెండు వికెట్లు తీయగా నజీమ్ షా ఒక్క వికెట్ తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News