Sunday, May 5, 2024

భారత మహిళలకు సిరీస్

- Advertisement -
- Advertisement -

India won second T20I match against Sri Lanka

 

దంబుల్లా: శ్రీలంకతో శనివారం జరిగిన రెండో టి20లో భారత మహిళల జట్టు ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ మరో మ్యాచ్ మిగిలివుండగానే 20 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఓపెనర్లు విష్మి (45), ఆటపట్టు (43) తప్ప మిగతావారు విఫలమయ్యారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 19.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. స్మృతి మంధాన (39), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 31 (నాటౌట్) జట్టును గెలిపించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News