- Advertisement -
పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్లో జరుగుతున్న ఆర్చరీ ప్రపంచకప్లో భారత మహిళల ఆర్చరీ బృందం స్వర్ణం సాధించింది. ఆదివారం జరిగిన వరల్డ్కప్ స్టేజ్-3లో రికర్వ్ టీమ్ గోల్డ్ మెడల్ గెలుచుకుంది. దీంతో ఆర్చరీ ప్రపంచకప్లో భారత్ రెండో స్వర్ణ పతకాన్ని సాధించింది. రికర్వ్ టీంలో దీపికా కుమారి, కోమలిక బరి, అంకిత భాకట్తో కూడిన భారత ఆర్చరీ బృందం మెక్సికోపై 5-1తేడాతో విజయం సాధించింది. కాగా, 32 ఏళ్ల భారత ఆర్చర్ అభిషేక్ వర్మ వ్యక్తిగత విభాగంలో శనివారం జరిగిన ఫైనల్లో బంగారు పతకం దక్కించుకున్న సంగతి తెలిసిందే.
Indian Women’s Recurve Archery team wins Gold medal
- Advertisement -