అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన 24గంటల వ్యవధిలో 95,327 మంది సాంపిల్స్ పరీక్షించగా 4,250 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తాజాగా మరో 33 మరణాలు సంభవించాయి. అదే సమయంలో 5,570 మంది బాధితులు కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఆంధ్రలో ప్రస్తుతం 44,773 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 18,79,872 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 12,599 మందిని కరోనా కబలించింది. నేటి వరకు రాష్ట్రంలో 2,17,32,933 మందికి కరోనా పరీక్షలు చేసినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.
Andhra Pradesh reports 4250 new Covid-19 cases
Andhra Pradesh reports 4,250 new #COVID19 cases, 5,570 recoveries and 33 deaths in the last 24 hours.
Active cases: 44,773
Total recoveries: 18,79,872
Death toll: 12,599 pic.twitter.com/T0qN8w17Hu— ANI (@ANI) June 27, 2021