- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కేసులు భారీగా పెరుగున్నాయి. ఇప్పటికే కోవిడ్-19 కేసులు 59 లక్షల మార్కును దాటాయి. గడిచిన 24 గంటల్లో 85,362 పాజిటివ్ కేసులు నమోదు కాగా…1,089మంది మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో మొత్తం పాజిటివ్ కేసులు 59,03,933కి చేరాయి. ఇందులో 9,60,969 యాక్టివ్ కేసులుండగా.. ఇప్పటివరకు 48,49,585 నయమై డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా 93,379 మంది కరోనాతో మృత్యువాత పడ్డారని ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. ఇండియాలో ఇప్పటివరకు 7.2కోట్ల మందికి కరోనా టెస్టులు చేయగా.. గత 24గంటల్లో 31.41లక్షల మందికి పరీక్షలు నిర్వహించినట్టు ఐసిఎంఆర్ ప్రకటించింది.
India’s COVID 19 cases tally crosses 59 lakh mark
- Advertisement -