- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 58,925 మంది కరోనా పరీక్ష చేయగా 2,239 మందికి కొత్తగా కోవిడ్-19 సోకింది. మరో 11మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా కేసులు సంఖ్య 1,83,866కి చేరింది. అదే సమయంలో 2,281 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 1,091 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా 1,52,441 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా… ప్రస్తుతం 30,334 యాక్టివ్ కేసులున్నాయి. 24,683 మంది కరోనా బాధితులు హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ లో కొత్తగా 316 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. తెలంగాణలో కోవిడ్ మరణాల రేటు 0.59 శాతంగా ఉండగా రికవరీ రేటు 82.90 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ వెల్లడించింది.
2239 new covid cases reported in Telangana
- Advertisement -