Sunday, April 28, 2024

మహిళ పోలీస్‌పై ఇన్‌స్పెక్టర్ అత్యాచారం?

- Advertisement -
- Advertisement -

Inspector rape on women spo in Uttar pradesh

లక్నో: ఓ మహిళ పోలీస్‌పై ఇన్‌స్పెక్టర్ అత్యాచారం చేసిన ఆరోపణలు రావడంతో అతడిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రాకేశ్ యాదవ్ అనే ఇన్‌స్పెక్టర్ శష్ని గేట్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళ పోలీస్ తన అత్తగారింటిపై వరకట్నం వేధింపుల కింద పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తాను స్టేషన్‌లో లేను అని కేసు విషయంలో మాట్లాడుదామని సదరు మహిళకు ఇన్‌స్పెక్టర్ పోన్ చేసి హోటల్‌కు రమ్మని కబురు పంపాడు. హోటల్‌లో ఆమెపై ఇన్‌స్పెక్టర్ అత్యాచారం చేసి మూడో వ్యక్తికి తెలిస్తే చంపేస్తానని బెదిరించి వెళ్లిపోయాడు. కొన్ని రోజుల తరువాత ఫోన్‌లో ఆమెను వేధించడం ప్రారంభించాడు. ఫోన్ కాల్స్ రికార్డ్ చేసి స్థానిక ఎస్‌పి మునిరాజ్‌కు మహిళ పోలీస్ ఫిర్యాదు చేసింది. కువార్శి పోలీస్ స్టేషన్‌లో రాకేశ్‌పై కేసు నమోదు చేసి అతడిని సస్పెండ్ చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News