- Advertisement -
ఢిల్లీ:ఐపిఎల్ 2021లో భాగంగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై బ్యాట్స్మెన్స్ అదరగొట్టారు. దీంతో చెన్నై, ముంబై జట్టుకు 219 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 218 పరుగుల భారీ స్కోరు సాధించింది. అంబటి రాయుడు(72 నాటౌట్: 27 బంతుల్లో 4ఫోర్లు, 7సిక్సలు) భారీ అర్థశతకంతో విధ్వంసం సృష్టించగా, మొయిన్ అలీ(58), డుప్లెసిస్(50)లు అర్ధశతకాలతో రాణించారు. ముంబై బౌలర్లలో కిరాన్ పోలార్డ్ రెండు వికెట్లు పడగొట్టగా.. ట్రెంట్ బౌల్ట్, బుమ్రాలు తలో వికెట్ తీశారు.
IPL 2021: CSK Set Target 219 runs for MI
- Advertisement -