మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా సర్టిఫికెట్లు కోల్పోయి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు విద్యాశాఖ ఉచితంగా డూప్లికేట్ మార్కుల మెమోలను జారీ చేసింది. పాఠశాల విద్యాశాఖ పరిధిలో 143 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోగా, వారందరికీ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు విద్యాశాఖ స్పెషల్ సిఎస్ చిత్రా రామచంద్రన్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ఇంటర్ విద్యాశాఖ పరిధిలో 1,255 మందితో పాటు 139 మంది డూప్లికేట్ పాస్ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకోగా, ఇప్పటివరకు 1,242 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ చేసినట్లు పేర్కొన్నారు. సర్టిఫికెట్లు కోల్పోయిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇందుకోసం ప్రత్యేకంగా హెల్ప్డెస్క్ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు కార్యాలయాల పనివేళల్లో హెల్ప్డెస్క్ నెంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు.
హెల్ప్డెస్క్ నెంబర్ల వివరాలు
పాఠశాల విద్యాశాఖ 040 23230942
ఇంటర్ విద్యాశాఖ 040 24600110
కళాశాల విద్యాశాఖ 040 24745021
సాంకేతిక విద్యాశాఖ 040 23222192