Saturday, April 20, 2024

7 రోజుల ఈడి రిమాండ్‌కు మనీశ్ సిసోడియా!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను ఢిల్లీ కోర్టు ఏడు రోజులపాటు ఈడి కస్టడీకి అప్పగించింది. తీహార్ జైలులో గురువారం అతడిని అరెస్టు చేసిన ఈడి 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరింది. కాగా సిబిఐ కేసులో సిసోడియా బెయిల్ వినతిని మార్చి 21న విచారించనున్నట్లు కోర్టు తెలిపింది.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ ఫ్రేమింగ్‌లో కుట్ర జరిగినట్లు ఈడి ఆరోపించింది. కొందరికి అక్రమంగా ప్రయోజనం చేకూర్చారంది. మనీశ్ సిసోడియా, విజయ్ నాయర్, కె.కవిత సహా సౌత్ గ్రూప్‌తో కలిసి కుట్ర చేశారని ఈడి వాదించింది. వారంతా కుమ్మకై కొత్త మద్యం విధానాన్ని రూపొందించారంది. తద్వారా వారు అసాధారణ లాభాన్ని పొందారంది. కాగా సిసోడియా తరఫు న్యాయవాది ‘అరెస్టులు చేయడం ఏజెన్సీల హక్కుగా తీసుకోవడం ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది. ఇలాంటి అరెస్టులపై కోర్టులు తీవ్రంగా చర్య తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది’ అన్నారు.

సిసోడియాను ఈడి అరెస్టు చేసిన ఒక రోజు తర్వాత ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. సిసోడియాను తీహార్ జైలులో అరెస్టు చేయడానికి ముందు ఈడి అధికారులు ప్రశ్నించారు. సిబిఐ ఫిబ్రవరి 26న కూడా ఇదే పాలసీలో ఇదివరకు ఆయనను అరెస్టు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News