Sunday, April 28, 2024

కెసిఆర్ వీరాభిమాని ఈమె…

- Advertisement -
- Advertisement -

Jindam Sattamma hardcore fan of CM KCR

ఫోటోలతో జిందం సత్తమ్మను పరిచయం చేసిన కెటిఆర్

హైదరాబాద్ : సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ ఆదివారం తన ట్విట్టర్ ఖాతా వేదికగా ఓ ఆసక్తికర ట్వీట్‌ను పోస్ట్ చేశారు. టిఆర్‌ఎస్ పార్టీకి, ఆ పార్టీ అధినేతకు వీరాభిమాని ఈమెనంటూ జిందం సత్తమ్మ అనే మహిళను పరిచయం చేస్తూ కెటిఆర్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె గురించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రత్యేక తెలంగాణ కోసం సాగిన ఉద్యమంలో చురుకుగా పాలుపంచుకున్న జిందం సత్తమ్మ ఇప్పటికీ అదే స్ఫూర్తితో కొనసాగుతోందని తెలిపారు. ఈ క్రమంలోనే ఆమె టిఆర్‌ఎస్‌తో పాటు పార్టీ అధినేత కెసిఆర్‌కు వీరాభిమానిగా మారిపోయారని పేర్కొన్నారు. నాటి నుంచి నేటి దాకా ఆమె తనకు మద్దతు పలుకుతున్నారని కూడా వెల్లడించారు. జిందం సత్తమ్మ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినవారేనని కూడా ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యమ సమయంలో తనతో కలిసి కదం తొక్కిన సత్తమ్మ ఫోటోను కెటిఆర్ తన ట్వీట్‌కు జత చేశారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని అగ్రహారం చీర్లపంచ ఆర్ అండ్ ఆర్ కాలనీలో జిందం సత్తమ్మ నివాసం ఉంటుంది. తెలంగాణ ఆందోళనలో చరుగ్గా పాల్గొంది. కెసిఆర్‌కు జిందం సత్తమ్మ కరడుగట్టిన అభిమాని… కెటిఆర్ అంటే ప్రాణం. 2009 ఎన్నికల నుంచి ఇప్పటివరకు కెటిఆర్‌కు గట్టి మద్దతురాలిగా ఉంది సత్తమ్మ.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News