Saturday, April 27, 2024

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ బోనాలు ఉత్సవాలకు ఎంఎల్‌సి కవిత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో జరగనున్న బోనాలు పండుగలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొననున్నారు. ఈనెల 15న ఆస్ట్రేలియాలోని బ్రిస్ బేన్ నగరంలో భారత జాగృతి ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో బోనాలు సంబరాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు బ్రిస్ బేన్ లోని గాయత్రి మందిరంలో జరగనున్న ఈ వేడుకలలో ప్రవాస భారతీయులతోపాటు ఆస్ట్రేలియా మంత్రులు, ఎంపిలు హాజరు కానున్నారు.

అలాగే జులై 16న న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ నగరంలో జరగనున్న బోనాలు వేడుకలో ఎంఎల్‌సి కవిత పాల్గొంటారు. న్యూజిలాండ్ తెలంగాణ సెంట్రల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ బోనాలు వేడుకలకు ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. ఆక్లాండ్‌లోని గణేష్ టెంపుల్‌లో ఉదయం 11కు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అలాగే ఆక్లాండ్ లో ఉదయం 9 కి వివిధ రాష్ట్రాల ఎన్నారైలు ఏర్పాటు చేసిన ప్రవాస భారతీయ సమ్మేళనం లో పాల్గొంటారు. సాయంత్రం తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ లో ఆస్ట్రేలియాలోని తెలంగాణీయులతో సమావేశం అవుతారు. ఆల్బర్ట్ వార్ మెమోరియల్ హాల్ లో ఈ సమావేశం జరగనుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News