Thursday, May 2, 2024

మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న కెసిఆర్ కుటుంబ సభ్యులు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: ఆషాడ బోనాల ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి విచ్చేసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబ సభ్యులకు మంత్రి తలసాని  స్వాగతం పలకడం జరిగింది. భక్తులు తప్పనిసరిగా కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో వైభవంగా బోనాల జాతర జరుగుతోంది. అమ్మవారికి, పట్టువస్త్రాలు, బంగారం భోనం, బియ్యాన్ని తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని అమ్మవారికి ప్రార్థించామన్నారు. మహంకాళి అమ్మవారిని  హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News