Friday, May 3, 2024

అందరినీ తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటోంది: పల్లా

- Advertisement -
- Advertisement -

KCR govt help to telangana people

హైదరాబాద్: తెలంగాణ వచ్చాక అన్ని వర్గాల ప్రజలను తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటోందని టిఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అని పల్లా తెలిపారు. వరంగల్ లో ఎంఎల్ సి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల హక్కులను కాపాడుతోందని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగులకు 43 శాతం పిఆర్‌సి ఇచ్చిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. ఎనిమిది లక్షల మంది పేదింటి ఆడ బిడ్డల పెండ్లికి ఆర్థిక సాయం అందించామని పల్లా స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యలను టిఆర్‌ఎస్ ప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News