Saturday, May 11, 2024

50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం: వేముల

- Advertisement -
- Advertisement -

50 Thousand jobs will be recruitment

మహబూబ్‌నగర్: తెలంగాణ వచ్చినప్పటి నుంచి లక్ష 32 వేల ఉద్యోగాలు ఇచ్చామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఎంఎల్‌సి ఎన్నికల ప్రచారంలో భాగంగా వేముల మీడియాతో మాట్లాడారు. ఎంఎల్‌సి ఎన్నికల సందర్భంగా నిరుద్యోగులను బిజెపోళ్లు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. త్వరలో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేయలేదన్నారు. ఉద్యోగుల జీతభత్యాలు దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో ఉన్నాయని, త్వరలో పిఆర్‌సి వస్తుందని, ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తామని వేముల హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News