Saturday, April 27, 2024

బిజెపోళ్లు… ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు: నిరంజన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

BJP not recruitment Govt jobs

మహబూబ్‌నగర్: టిఆర్‌ఎస్ ఎంఎల్‌సి అభ్యర్థి వాణిదేవి ఉన్నత విద్యావంతురాలు, మచ్చలేని వ్యక్తి అని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అని నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బిజెపి అభ్యర్థి రామ్‌చందర్ రావు న్యాయవాదుల సమస్యల పరిష్కారంలో విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. వంద రోజుల్లో హైకోర్టు విభజన చేస్తానని బిజెపోళ్లు పట్టించేకోలేదని మండిపడ్డారు. సిఎం కెసిఆర్, తెలంగాణ ప్రభుత్వం కృషితోనే హైకోర్టు సాధ్యమైందన్నారు. న్యాయవాదుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం వంద కోట్ల రూపాయలు నిధి ఏర్పాటు చేసిందన్నారు. ఆరేండ్లలో మోడీ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. టిఆర్‌ఎస్ వాణిదేవిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News