Friday, May 3, 2024

కెసిఆర్ గొప్ప పాలనాదక్షుడు: గద్దర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సిఎం కెసిఆర్ గొప్ప ప్రజానాయకులు, పాలనాదక్షులు అని ప్రజా గాయకుడు గద్దర్ ప్రశంసించారు. జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారం సందర్భంగా టిఆర్ఎస్ వెంకటాపురం డివిజన్ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ గురువారం గద్దర్‌ను కలిశారు. ఈ సందర్భంగా గద్దర్ మీడియాతో మాట్లాడారు.  దేశ రాజకీయాలను గతిని సమూలంగా మార్చాల్సిన అవసరముందన్నారు. కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తే కల్చరల్ విభాగం ద్వారా సంపూర్ణ మద్దతు ఇస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో సగభాగం సస్యశ్యామలమైందన్నారు. సాగునీరు అందించడంతో రైతులు, ప్రజలు సంతోషంగా ఉన్నారని పొగిడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News