Sunday, April 28, 2024

నల్లగొండ రోడ్డు ప్రమాదాలపై కెసిఆర్ దిగ్భ్రాంతి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : నల్లగొండ జిల్లాలో జరిగిన వేరు వేరు రోడ్డు ప్రమాదాల దుర్ఘటనలపై బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాల్లో పలువురు మృత్యువాత పడటంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు కెసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని, మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కెసిఆర్ ప్రభుత్వాన్ని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News