Saturday, May 4, 2024

మానవీయ కోణంలో కెసిఆర్ పాలన

- Advertisement -
- Advertisement -
దివ్యాంగుల పెన్షన్ రూ.4,116కు పెంచుతూ జిఓ జారీ

హైదరాబాద్ : దేశానికే ఆదర్శంగా మానవీయకోణంలో కొనసాగుతున్న ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం మరో చారిత్రక ఘట్టానికి వేదికగా నిలచింది. తెలంగాణ ప్రభుత్వం అభాగ్యులైన, ఆసరా అవసరమైన దివ్యాంగులకు నేనున్నానంటూ ఆర్థిక భరోసాగా అందిస్తున్న మొత్తాన్ని మరింతగా పెంచింది. మంచిర్యాల సభ వేదికగా దివ్యాంగుల పెన్షన్ ను పెంచబోతున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి కెసిఆర్ , ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఈ మేరకు దివ్యాంగుల పెన్షన్ ను రూ. 1,000 పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి నెలా రూ. 3,116 పెన్షన్ ను అందుకుంటున్న దివ్యాంగులు, ఇక మీదట రూ. 4,116 పెన్షన్ ను అందుకోబోతున్నారు. ఇది ఈ నెల నుండి అమలులోకి వస్తుందని ప్రభుత్వం జీఓలో పేర్కొంది. దీని ప్రకారం 5 లక్షల పైగా దివ్యాంగ పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. అత్యధిక పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది.
సిఎంకు మంత్రి కెసిఆర్ కృతజ్ఞతలు
దివ్యాంగుల పెన్షన్‌లు పెంచడం పట్ల ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అత్యధిక పెన్షన్లు అందిస్తూ దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి హరీష్ రావు ట్విట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News