Saturday, April 27, 2024

మొదటిసారి అర్థం కాలేదట!

- Advertisement -
- Advertisement -

నాని సరసన కీర్తి సురేష్ ఇంతకుముందే ‘నేను లోకల్’ చిత్రంలో నటించి ప్రేక్షకులను అలరరించింది ఇప్పుడు మరోసారి ‘దసరా’ చిత్రంలో హీరోయిన్‌గా దర్శనమిస్తోంది. అయితే ఈ సినిమా కథ ఆమెకి మొదటిసారి అర్థం కాలేదట. కీర్తి సురేష్‌కి కథ చెప్పేందుకు కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల వెళ్ళాడట. ఆమెకి మూడు గంటల పాటు ఆ దర్శకుడు కథ చెప్పాడు. ఆమె విని అతన్ని పంపించేసింది.

ఆ తర్వాత కొన్ని రోజులకు నాని ఆమెకి ఫోన్ చేసి కథ ఎలా ఉందని అడిగితే ఏమి కథ అని సమాధానం ఇచ్చిందట. దాంతో, డౌట్ వచ్చి నాని శ్రీకాంత్‌కి ఫోన్ చేసి నువ్వు కీర్తికి నిజంగా కథ చెప్పావా అని అడిగాడట. అతను అవును అని జవాబు ఇచ్చాడు. మళ్లీ ఆమెకి ఫోన్ చేసి ఓ అబ్బాయి వచ్చి మూడు గంటలు కథ చెప్పాడు కదా ఆ కథ ఎలా అనిపించింది అని అడిగాడు నాని. అవును కానీ నాకు అది అర్థం కాలేదు అని సమాధానం ఇచ్చిందట కీర్తి సురేష్. శ్రీకాంత్ ఓదెల పూర్తిగా తెలంగాణ యాసలో చెప్పేసరికి ఆమెకి అర్థం కాలేదని తర్వాత నానికి అర్ధమైంది.

ఆ తర్వాత మరోసారి ఆమెకి ఇంగ్లిష్‌లో కథ చెప్పడంతో ఆమె ఒకే చెప్పి, ‘దసరా’ సినిమా చేసింది. ఈ సినిమాలో ఆమె వెన్నెల అనే సింగరేణి యువతిగా కనిపిస్తుంది. నాని మొదటిసారి తెలంగాణ యాసలో డైలాగులు చెప్పాడు. కీర్తి పాత్ర కూడా అధేవిధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా తనకెంతో ఇష్టమని చెబుతోంది కీర్తి. ‘దసరా’ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News