Thursday, May 2, 2024

ఉద్యమ ద్రోహులంతా ప్రగతి భవన్ లో ఉన్నారు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ప్రజలు కోరుకునే మార్పు బిజెపి పార్టీతోనే సాధ్యం అవుతుందని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ఈరోజు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో పలువురు బిజెపి ముఖ్య నాయకులతో కలిసి కిషన్ రెడ్డి నగరంలోని పార్టీ ఆపీసులో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. “రాష్ట్రంలో నిశబ్ద విప్లవం రాబోతుంది. రాష్ట్రంలోని అవినీతి, కుటుంబ పాలనను తుడిచి పెట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు.

ఎన్నికల్లో ప్రజలు బిజెపిని ఆశీర్వదించాలి. తెలంగాణలో సకలజనుల పాలన రావాలి. అది బిజెపితోనే సాధ్యం అవుతుంది. ఎన్నికలకు బిజెపి పార్టీ సిద్ధంగా ఉంది. తెలంగాణలో బిజెపి జెండా ఎగురవేస్తాం. బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండు, మూడు స్థానాల కోసం పోటీ పడాలి. ఉద్యమకారులను కాంగ్రెస్ గౌరవించలేదు. ఉద్యమ ద్రోహులంతా ప్రగతి భవన్ లో ఉన్నారు. అధికారాన్ని, డబ్బును ఉపయోగించి కెసిఆర్ ఎన్నికలకు వెళ్తున్నారు. తెలంగాణలో కెసిఆర్ కుటుంబ పాలన పోవాలి” అని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News