Wednesday, May 8, 2024

పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత

- Advertisement -
- Advertisement -

పుట్టినరోజున మొక్కలు నాటిన కెకె

KK Plant tree in his birth day in Green india challenge

మనతెలంగాణ/హైదరాబాద్: పుట్టిన రోజుపండుగ వేడుకల్లో గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ భాగమైంది. జన్మదినం రోజు ఒక మంచి పనిచేయాలని ఆలోచించే ప్రముఖులు, సెలబ్రిటీలు మొక్కలు నాటడంకంటే ఉన్నతమైంది మరొకటి లేదని భావిస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు, టిఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ డాక్టర్ కె.కేశవరావు తనపుట్టిన రోజు సందర్భంగా ఆదివారం మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ మొదలు పెట్టిన గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఆయన తన నివాసంలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కేశవరావుకు గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ కెకెకు వృక్ష వేదం పుస్తకాని అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మీ, టియుఎఫ్‌ఐడిసి కార్పొరేషన్ చైర్మన్ విప్లవకుమార్,టిఆర్‌ఎస్ నాయకులు పాల్గొనారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News