కోల్కతా బోణీ.. సన్రైజర్స్ చిత్తు
అబుదాబి: యుఎఇ వేదికగా జరుగుతున్న ఐపిఎల్లో కోల్కతా నైట్రైడర్స్ తొలి విజయం నమోదు చేసింది. శనివా రం జరిగిన మ్యాచ్లో కోల్కతా ఏడు వికెట్ల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను చిత్తు చేసింది. 143 పరుగుల లక్ష్యాన్ని కోల్కతా 18 ఓవర్లలోనే కేవ లం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్కు దిగిన కోల్కతాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ సునీల్ నరైన్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. వన్డౌన్లో వచ్చిన నితీష్ రానా కొద్ది సేపు మెరుపులు మెరిపించాడు. హైదరాబాద్ బౌలర్లపై ఎదురు దాడికి దిగిన రానా 13 బంతుల్లోనే ఆరు ఫోర్ల తో వేగంగా 26 పరుగులు చేశాడు. అయితే ప్రమాదకరంగా మారిన రానా ను నటరాజన్ వెనక్కి పంపాడు. తర్వాత వచ్చిన కెప్టెన్ దినేశ్ కార్తీక్ విఫలమయ్యాడు. కార్తీక్ పరుగులేమి చేయకుండానే రషీద్ ఖాన్ బౌలింగ్లో ఔటయ్యా డు.
ఒకవైపు వికెట్లు పడుతున్నా యువ ఆటగాడు శుభ్మన్ గిల్ పోరాటం కొనసాగించాడు. అతనికి ఇయాన్ మోర్గాన్ అండగా నిలిచాడు. ఇద్దరు కలిసి మరో వికెట్ నష్టపోకుండానే కోల్కతాను గెలిపించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన గిల్ 62 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 70 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. మోర్గాన్ 29 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్స్లతో అజేయంగా 42 పరుగులు చేసి తనవంతు పాత్ర పోషించాడు. అంతకుముందు తొలుత బ్యాటిం గ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 142 పరుగులు చేసింది. మనీష్ పాండే (51), వార్నర్ (36), సాహా (30) మాత్రమే కాస్త రాణించారు.
KKR win by 7 wickets against SRH