Sunday, May 5, 2024

పల్నాడులో ఇసుక దందా… వైసిపి ఎంఎల్‌ఎకు సవాల్

- Advertisement -
- Advertisement -

 

పల్నాడు: పెదకూరపాడు నియోజకవర్గంలో ఇసుక రగడ నెలకొంది. వైసిపి ఎంఎల్‌ఎ శంకర్ రావు సవాల్‌కు సిద్ధంగా ఉన్నామని మాజీ ఎంఎల్‌ఎ కొమ్మలపాటి శ్రీధర్ తెలిపారు. ఈ సందర్భంగా కొమ్మలపాటీ రీకౌంటర్ ఇచ్చారు. ఎంఎల్‌ఎ శంకర్ రావు కనుసన్నల్లోనే ఇసుక దోపిడీ జరుగుతోందన్నారు. ప్రశ్నించినవారిపైనే అక్రమ కేసులు ఎందుకు బనాయిస్తున్నారని శ్రీధర్ అడిగారు. కృష్ణా నదిలో అక్రమంగా రోడ్డు వేసి ఇసుక తరలిస్తున్నారని, ఆదివారం ఉదయం అమరావతిలో చర్చలకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News