Wednesday, May 1, 2024

350 ఎకరాల్లో ఆక్వా హబ్ ప్రారంభిస్తాం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

సిరసిల్ల: చీర్లవంచలో 350 ఎకరాల్లో ఆక్వా హబ్ ప్రారంభిస్తామని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చెప్పారు. సోమవారం జిల్లాలో తంగళ్లపల్లి మండలంలోని చీర్లవంచలో మంత్రి కెటిఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి అంబేడ్కర్, చాకలి ఐలమ్మ విగ్రహాలను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. ”ఆక్వా హబ్‌లో చీర్లవంచ చెందిన వారికి ప్రాధాన్యత ఇస్తాం. గ్రామంలో ప్రభుత్వం భూమి ఉంటే సొసైటీ భవనం నిర్మిస్తాం. దళితబంధు అంటే పంచిపెట్టే కార్యక్రమం కాదు.. అర్హులకే ఇస్తున్నాం. సమాధులు తవ్వుదాం, పేపర్ లీక్ చేద్దాం అనే వాళ్లకు ఓటేయకండి” అని ప్రజలను కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News