Tuesday, April 30, 2024

మంత్రి కొండా సురేఖ కు కెటిఆర్ లీగల్ నోటీసులు

- Advertisement -
- Advertisement -

ఫోన్ ట్యాపింగ్ వ్వవహారంలో తనపై అవాస్తవాలు ఆరోపిస్తున్నారని పేర్కొంటూ బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ దేవాదాయశాఖా మంత్రి మంత్రి కొండా సురేఖతో పాటు కాంగ్రెస్ ఎంఎల్‌ఎ యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కేకే మహేందర్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంబంధం లేని విషయాల్లో తన పేరును ప్రస్తావిస్తూ, అవాస్తవాలతో కూడిన ఆరోపణలు చేసినందుకు కెటిఆర్ లీగల్ నోటీసులు పంపించారు. వారం రోజుల లోపు క్షమాపణ చెప్పాలని, లేదంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఏ మాత్రం సంబంధం లేకపోయినా, పదే పదే తన పేరును కుట్రపూరితంగా ప్రస్తావిస్తున్నారని కెటిఆర్ మండిపడ్డారు.

తన ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడుతున్న వీరిపై న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ముగ్గురు నేతలు ఎలాంటి ఆధారాలు లేకుండా తన పేరును ప్రస్తావిస్తూ, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని కెటిఆర్ దుయ్యబట్టారు. మరికొన్ని మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానళ్లకు కూడా కెటిఆర్ మరోమారు నోటీసులు పంపించారు. సంబంధం లేని అంశంలో తన పేరును, తమ పార్టీ పేరును ప్రస్తావిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి అయినా సరే వదిలిపెట్టేది లేదని తేల్చిచెప్పారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై తమకు ఉన్న రక్షణలను ఉపయోగించుకొని తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News