Sunday, April 28, 2024

అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిపోయింది: కెటిఆర్

- Advertisement -
- Advertisement -
హైదరాబాద్: ప్రజలు మనకు పదేళ్లు అవకాశం ఇచ్చారని, అధికారంలోకి వస్తాం అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకోలేదని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. నోటికి ఏది వస్తే అది హామీ ఇచ్చారని, ఆరు గ్యారెంటీలు అన్నారు, కానీ 420 హమీలిచ్చింది కాంగ్రెస్ వాళ్ళ తప్పుడు ప్రచారం నమ్మి ప్రజలు గొప్పగా పని చేసిన నాయకులను కూడా తిరస్కరించారని మండిపడ్డారు. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రసంగించారు. రేషన్ కార్డులు ఇవ్వలేదు అని ప్రచారం చేశారు కానీ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు అన్నారని, తొమ్మిదిన్నరేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చిందని గుర్తు చేశారు. దేశంలో అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది బిఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. తాము ఏనాడు చెప్పుకోలేదని, ప్రభుత్వ ఉద్యోగులకు అత్యధిక వేతనాలు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వమేనని, కానీ తాము చెప్పుకోలేదని, ప్రచారం చేస్కోలేదన్నారు.
దేశంలో అందరికన్నా ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులకు 73% జీతాలు పెంచిన ఏకైక నాయకుడు కెసిఆర్ అని ప్రశంసించారు. 29 లక్షల ఫించన్లను 46 లక్షలకు పెంచినా ఏనాడు చెప్పుకోలేదన్నారు. దేశంలో అందరికన్నా ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించింది బిఆర్ఎస్ ప్రభుత్వమే కానీ ఇలాంటి అనేక అంశాలను చెప్పుకోవడం విఫలమయ్యమన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిపోయిందని, పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్ చేసి ఉంటే తాము గెలిచే వాళ్ళమన్నారు. వందలాది సంక్షేమ కార్యక్రమాలు మన ప్రభుత్వ హయాంలో అమలు చేసినా, ఏనాడు కూడా ప్రజలను లైన్లలో నిలబెట్టలేదని, ప్రజల సౌకర్యమే చూసాము కానీ రాజకీయ ప్రయోజనము, రాజకీయ ప్రచారమే గురించి ఏనాడు ఆలోచించలేదని, ప్రజలు మనల్ని పూర్తిగా తిరస్కరించలేదని గుర్తుంచుకోవాలని కెటిఆర్ పేర్కొన్నారు.
బిఆర్ఎస్ పార్టీకి మూడో వంతు సీట్లు 39 వచ్చాయని, 14 స్థానాల్లో ఓటమి కేవలం గరిష్టంగా 6 వేల ఓట్లతోనే జరిగిందని, మొత్తంగా కాంగ్రెస్ మనకు తేడా కేవలం 1.85 శాత అని చెప్పారు. స్థానిక సంస్థల నుంచి మొదలుకొని, అసెంబ్లీదాకా బలమైన నాయకత్వం మనకున్నదని తెలియజేశారు. బలమైన ప్రతిపక్షం మనదని, అన్నిటికీ మించి కెసిఆర్ లాంటి గొప్ప నాయకుడు మనకున్నారని, మహబూబ్ బాద్ పార్లమెంట్ ఎన్నికలే మన గెలుపుకు సోపానం కావాలని కెటిఆర్ పిలుపునిచ్చారు.
ఎన్నికల ముందు రైతు రుణమాఫీ చేస్తామంటూ రేవంత్ రెడ్డి అనేక మాటలు మాట్లాడారని, రుణం ఉన్నవాళ్లే కాదు, వ్యవసాయ రుణం లేనివాళ్లు కూడా తీసుకోవాలని కోరారు. రాగానే వెంటనే రుణమాఫీ చేస్తామన్నారు ఇచ్చిన అడ్డగోలు హామీలను నెరవేర్చే దారిలేకనే అప్పులు, శ్వేతపత్రాల నాటకాలను ఆడుతున్నారని దుయ్యబట్టారు. అందుకే వాస్తవాలు అందరికీ తెలియాలనే స్వేద పత్రం రూపొందించామన్నారు. ఎవరు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదని మన పార్టీకి బలమైన నాయకులు అద్భుతమైన నాయకత్వం ఉన్నది ఇలాంటి పార్టీ సమావేశాలను వరుసగా పెట్టుకుంటామని చెప్పారు. అనుబంధ సంఘాలను బలోపేతం చేస్తామని పార్టీకి అన్ని వర్గాలను దగ్గరయ్యేలా కార్యక్రమాలు చేపడతామని, గిరిజనులకు స్థానిక సంస్థల రిజర్వేషన్ తో పాటు పొడు భూముల పట్టాల పంపిణీ, అనేక ఇతర సంక్షేమ పథకాలు అనేక కార్యక్రమాలను  మన ప్రభుత్వం గతంలో అందించామని కెటిఆర్ వివరించారు. అయినా గిరిజనులు ఎక్కువ ఉన్న చోట్ల కూడా ప్రజలు పూర్తి మద్దతు మనకివ్వలేదన్నారు. ఇలాంటి వాటన్నింటి విమర్శ చేసుకుని ముందుకుపోతామని కెటిఆర్ వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News