Sunday, April 28, 2024

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కథ ఖతం:కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మోసం కాంగ్రెస్ నైజం అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. నయవంచనకు నిలువెత్తు రూపం కాంగ్రెస్ అని ట్విట్టర్ (ఎక్స్) వేదికగా విమర్శించారు. అందుకే ఆదిలోనే ఇండియా కూటమికి బీటలు వ చ్చాయన్నారు. అందుకే కాంగ్రెస్‌ను వీడి టిఎంసి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లు ఒంటరిపోరుకు సిద్ధమయ్యాయని వెల్లడించారు. మిత్రపక్షాలను ఒప్పించలేని కాంగ్రెస్ దేశ ప్రజలను ఏం మెప్పిస్తుందని ప్రశ్నించారు. మోడీని, బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు లేదని,

ఇండియా కూటమికి అంతకన్నా లేదని విమర్శించారు. మిత్రపక్షాలు దూరం కావడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇక దేశ ప్రజల చూపు ప్రాంతీయ శక్తులవైపే ఉందని వ్యాఖ్యానించారు.తెలంగాణలో కెసిఆర్ అయినా, బెంగాల్‌లో మమతా దీదీ అయినా, పంజాబ్, ఢిల్లీలో కేజ్రీవాల్ అయినా, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేది రాష్ట్రాల్లో బలమైన పార్టీలే అని కెటిఆర్ స్పష్టం చేశారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కథ ఖతం అని అన్నారు. కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంలో ప్రాంతీయ శక్తుల పాత్రే కీలకమని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News