Saturday, May 4, 2024

టెస్లాతో చర్చలు జరపండి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : భారతదేశంలో టెస్లా కంపెనీ తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ కంపెనీ తయారీ యూనిట్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేసేలా చూడాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ కోరారు. టెస్లా కంపెనీ నిర్ణయం నేపథ్యంలో ఎక్స్ వేదికగా ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చే శారు. ఫ్యా క్టరీ ఎక్కడ పెట్టాలన్న అంశంపై ఆ కంపెనీ ప్రతినిధి బృందాన్ని పంపిస్తు న్న నేపథ్యంలో ప్లాంట్‌ను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని సూచించారు. టెస్లా బృందం హైదరాబాద్‌లో పర్యటించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. టెస్లా కంపెనీని రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు రాష్ట్రం ప్రభు త్వం తన శక్తి యుక్తులు అన్నింటినీ ఉపయోగించి ప్రయత్నించాలని ట్వీట్‌లో కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News