Sunday, April 28, 2024

రేపు సిరిసిల్లలో కెటిఆర్ పర్యటన

- Advertisement -
- Advertisement -

సిరిసిల్ల: రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ నేడు సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పర్యటన వివరాలు ఉదయం 10.30 గంటలకు చీర్లవంచలో అంబేద్కర్, చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ, ఎస్సీ, ముదిరాజ్ కమ్యూనీటి హాల్‌కు శంఖుస్థాపన, సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం చేయనున్నారు. 11.30 గంటలకు పాపయ్యపల్లె గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం చేస్తారు. మద్యాహ్నం 12 గంటలకు గోపాల్ రావు పల్లెలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేస్తారు. ఒంటి గంటకు తంగళ్లపల్లి మండలం మండెపల్లిలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం, 1.30 గంటలకు గండి లచ్చపేటలో అంబేద్కర్, జ్యోతి రావుపూలే విగ్రహావిష్కరణ,

కెసిఆర్ ప్రగతి ప్రాంగణం, దళిత బంద్ పథకం ద్వారా ఏర్పాటు చేసిన పౌల్ట్రీ ఫార్మ్ ప్రారంభోత్సవం అనంతరం లబ్దిదారులతో కలిసి లంచ్ చేస్తారు. 2.30 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ, గౌడ, మహిళ సంఘాలు, చిట్టివాడుపై బ్రిడ్జి ప్రారంభోత్సవం చేస్తారు. 3.30గంటలకు బుగ్గరాజేశ్వర తండా(అక్కపల్లి) గ్రామ పంచాయితీ భవనం, ఎస్టీ కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం చేస్తారు. 4గంటలకు రాచర్ల గుండారంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేయనున్నారు. 5గంటలకు గంభీరావుపేట మండలం గోరింట్యాలలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News