హైదరాబాద్: నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఐటి,పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ మూడో రోజు పర్యటిస్తున్నారు. వరద ప్రభావిత కాలనీలను మంత్రి పరిశీలిస్తున్నారు. ఖైరతాబాద్ బి.ఎస్.మక్తా కాలనీలో పునరావాస కేంద్రాన్ని శుక్రవారం ఆయన పరిశీలించి, బాధితులకు అందిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులకు రేషన్ కిట్ తో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ముంపు నుంచి తేరుకున్న కాలనీల్లో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రజలంతా తాగునీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వరద ప్రభావతి కాలనీల్లో ప్రత్యేకంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన వైద్య సదుపాయాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ సందర్భంగా మంత్రి పునరావాస కేంద్రాల్లోని బాధితులకు ఆహారం, దుప్పట్లు, మందులు పంపిణీ చేశారు.
వర్ష ప్రభావిత కాలనీల్లో మూడోరోజు పర్యటిస్తున్న పురపాలక శాఖ మంత్రి @KTRTRS. ఖైరతాబాద్ లోని బిఎస్ మక్త కాలనీలో @GHMCOnline ఏర్పాటుచేసిన షెల్టర్ హోమ్ ని పరిశీలించి అక్కడ అందిస్తున్న సౌకర్యాలపైన ఆరా తీసిన మంత్రి. #HyderabadRains pic.twitter.com/xgY1LzXHV6
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) October 16, 2020
KTR Visits Flood Affected Areas in Hyderabad