Sunday, April 28, 2024

జీడిమెట్ల డివిజన్ లో కుత్బుల్లాపూర్ గోస – శ్రీశైలం అన్న భరోసా

- Advertisement -
- Advertisement -

కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కుత్బుల్లాపూర్ గోస – శ్రీశైలం అన్న భరోసా కార్యక్రమంలో భాగంగా మంగళవారం మాజీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ జీడిమెట్ల డివిజన్ లోని శ్రీనివాస్ నగర్, సాయినగర్, శివారెడ్డి నగర్, న్యూ వివేకానంద్ నగర్ కాలనీల్లో స్థానిక బిజెపి నాయకులతో కలిసి పాదయాత్ర చేపట్టారు.

స్థానికంగా ఉన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పాదయాత్రలో క్షేత్ర స్థాయిలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బస్తీల్లో భాజపా జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లా డుతూ, దశాబ్ది ఉత్సవాల పేరిట అధికారులు ఆఫీస్ లకు రావడం లేదని, ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు లేకపోతె ప్రజా సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి,దశాబ్ది ఉత్సవాలు చేయడం విడ్డురంగా ఉందని అన్నారు. బిజెపి ప్రభుత్వం రాగానే కాలనీల్లో సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో కేకేఎం ట్రస్ట్ చైర్మన్,బిజెపి నాయకుడు కూన శ్రీనివాస్ గౌడ్, బిజెపి అసెంబ్లీ కన్వీనర్ బుచ్చిరెడ్డి, జిల్లా నాయకులు నటరాజ్ గౌడ్, గరిగే శేఖర్ ముదిరాజ్, నల్లా జయశంకర్ గౌడ్, జగన్ మోహన్ రావ్, డివిజన్ ఇంచార్జులు కృష్ణ యాదవ్, మోతె శ్రీనివాస్, మహిళా మోర్చా అసెంబ్లీ కోకన్వీనర్ అలివేలు, ఎస్సి మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింగ రావ్, నాయకులు బాలప్ప, అరుణ్, మురళి, వీరబాబు, కృష్ణవేణి, పద్మావతి, కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఈశ్వర్ గౌడ్, విశాల్, రాంరెడ్డి, గోపాల్ రెడ్డి, శివా రెడ్డి పవన్ గౌడ్, బిక్షపతి, సత్తయ్య గౌడ్, నందు సింగ్, నాని, నాగరాజు, రాజేష్, ఫయాజ్, అక్షయ్, శివ, మహిళలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News